తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతిష్టాత్మకంగా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన Arrive-Alive అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గౌరవ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణ స్థానికులు,వ్యాపారస్తులు,ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రత్యేక రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పోలీసు వారు తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడటంలో భాగంగానే నిత్యం పోలీసులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించే విధంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.హెల్మెట్ ధరించి ప్రయాణించటం వలన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు.Arrive-Alive అనే కార్యక్రమంతో ప్రతిష్టాత్మకంగా కేవలం రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం పోలీసులు శ్రమించడం హర్షనీయమని కొనియాడారు.ప్రజల భద్రత,సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీస్ శాఖకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్,3టౌన్ సీఐ శివప్రసాద్,లక్ష్మిదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి,ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్,ఎస్సై విజయ కుమారి,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ