తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) జీవితం విలువైనది భద్రత మన బాధ్యత అంటూ 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో వాహనదారులు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు. సోమవారం 16వ డివిజన్లో జరిగిన ర్యాలీలో కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు .జీవితం విలువైనది, భద్రత మన బాధ్యత, రోడ్డు ప్రమాదాలనేవి కేవలం వార్తలు మాత్రమే కాదని ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, మన ప్రాణాలని మనం కాపాడుకోవడానికి నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నాణ్యమైన హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు ఇది మన ప్రాణ రక్ష కవచం అని అన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుందని, వేగం కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి పరిమిత వేగంతో ప్రయాణించాలి అన్నారు. మనం ఐదు నిమిషాలు ముందు వెళ్లడం కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నామని అన్నారు .ఆ ఐదు నిమిషాల తొందర మీ జీవితాంతం మీ కుటుంబాన్ని దూరం చేస్తుంది ఐదు నిమిషాలు లేటుగా వెళ్తే నష్టమేమీ లేదు. వాహనదారులు పాదచారులకు ప్రాధాన్యత నివ్వాలి, వాళ్లను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలి మన నగరం సురక్షితంగా ఉండాలంటే కేవలం రోడ్లు బాగుంటే సరిపోదు. మన ప్రయాణ విధానం మారాలి. చట్టం మీద భయంతో కాదు, బాధ్యతతో నిబంధనలు పాటిద్దాం. ఈ రోజు నుంచి మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాంమని, నేను ట్రాఫిక్ నియమాలను పాటిస్తాను, నా కుటుంబాన్ని నాతోటి వారిని కాపాడుకుంటానని ఆమె వారితో ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దు.రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. ఈ వారోత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగిద్దాంమని ఆమె పిలుపునిచ్చారు. విరాలిలో డివిజన్ పౌరులు మునిగడప వెంకటేశ్వర్లు, జిత్తుక దిలీప్ ,గుంజ వెంకన్న, రామ్ రాకేష్ ,వాసం బాబు, సబ్బని పాపారావు ,బి శ్రీను, కందుకూరి గంగరాజు, అఖిల్ ,సూర్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ