తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని టేకులపల్లి మండలము బేతంపూడి పంచాయతీ వెంకట్యా తండ కు చెందిన బాణోత్ నందినీ మరోసారి నిరూపించింది. స్థానిక ZPHS టేకులపల్లిలో చదువుతున్న నందినీ పదవ తరగతి పరీక్షల్లో 507 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.MPPS వాగొడ్డు తండకు చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మా కుమార్తె అయిన నందినీ, మొదటి నుంచీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది. పరిమిత వనరుల మధ్యనైనా కృషి, పట్టుదల ఉంటే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె రుజువు చేసింది.నందినీ ప్రతిభపై పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమె క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. గ్రామస్తులు, స్నేహితులు నందినీని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నందినీ తల్లిదండ్రులు మాట్లాడుతూ,“మేము ప్రభుత్వ బడులపైనే నమ్మకం పెట్టుకున్నాం. మా కూతురు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయి మార్కులు సాధించడం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఈ ఫలితం రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని నందినీ విజయంతో మరోసారి స్పష్టమైంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందుతున్న వసతులు, నాణ్యమైన విద్య మరియు ఇంగ్లీషు మీడియం భోధన ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ లోనే చవించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని , నాణ్యమైన భోధన బోధించే ఉపాద్యాయులు ఉన్నారని , ఆమె సాధించిన ఈ ఫలితం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
Admin
తెలుగు వెలుగు టీవీ