తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడలు మానసిక ఉల్లసాన్ని పెంపొందిస్తాయని కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అన్నారు.సోమవారం ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో రెడ్డి భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కొత్తగూడెం క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలకు ముఖ్యఅతిథిగా లక్కినేని సత్యనారాయణ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని,టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్యహపరిచారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఏ పోటీల్లో అయినా గెలుపు ఓటములు సహజమని అన్నారు.గెలిచినా వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించలని,ఓడిన వారు మరింత పట్టుదలతో ఆడుతూ గెలుపు దిశగా అడుగులు వేయాలన్నారు.క్రీడాకారులను ప్రోత్సహించడం కొరకు క్రీడాకారులను అందరినీ సమన్వయం చేసుకుంటూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.క్రికెట్ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.మొదటి మ్యాచ్ న్యూ స్టార్స్ వర్సెస్ స్టార్ లెవెన్ మధ్య జరగగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్టార్ లెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 213 రన్స్ చేయగా తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూ స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 108 రన్స్ చేయాగ స్టార్ లెవెన్ జట్టు 105 రన్స్ తేడాతో గెలుపొందారు.ఈకార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్,శ్రీనివాస్,రమేష్,క్రాంతి,గొల్లపల్లి అశోక్,అమీర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ