తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలకు తెలియజేయునది ఏమనగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయని కళాశాల ప్రధానాచార్యులు బండి శ్రీనివాస్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షకు సమగ్రంగా సిద్ధం కావడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. అందువల్ల ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.శిక్షణా తరగతులు ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు. పూర్తి వివరాలకు 7989103692 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ