తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో గల బస్టాండు వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ వరకు సైడ్ కాలువను పునరుద్ధరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక బసవయ్య కాంప్లెక్స్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు గల జాతీయ రహదారి పక్కన కాలువ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ఆగుతుండడంతో వాహనదారులకు పాదచారులకు ఎంతో ఇబ్బందికరంగా ఉందని కాలువపై నిర్మాణాలు చేసి కాలువను పూడ్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కాలువను మూసివేసినా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా కాలువలు ఉన్నా జాతీయ రహదారి పక్కన 5 అడుగుల కాలువ వుండాలనే నిబంధన వున్నప్పటికీ బస్టాండ్ నుండి పోస్ట్ ఆఫీసు వరకు సైడ్ కాలువ లేకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బస్టాండు నుండి పోస్ట్ ఆఫీసు వరకు సైడ్ కాలువను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి, వంగా రవిశంకర్, వినయ్, సోను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ