తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా. ధరల నియంత్రణలో కేంద్రం విఫలం.అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలి.ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదు.ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలి. ప్రజాసమస్యలు గుర్తించి పరిస్కారానికి కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే. ఎమ్మెల్యే కూనంనేని కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.దేశంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలని, అప్పుడే పాలకుల్లో చలనం వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న చేపట్టబోయే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్రం తన వైఖరి మార్చుకుని ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాసమస్యలు గుర్తించి వాటి పరిస్కారానికి నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని, ప్రజల పక్షాన నిలబడి పోరాడినప్పుడే పార్టీకి నిజమైన బలం చేకూరుతుందని గుర్తుచేశారు. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గంగా కొత్తగూడెం మారుతోందని, అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిస్కారంకావడం హర్షణీయమని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల రమేష్, గొనె మని, మునిగడప వెంకటేశ్వర్లు, కొమారి హన్మంతరావు, పట్టణ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎండి యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, ముడెత్తుల శ్రీనివాస్, గోపి కృష్ణ, ధర్మరాజు, సుధాకర్, పల్నాటి ప్రశాంత్, పి ధనలక్ష్మి, వై శంకర్, జహీర్, నగేష్, సత్యనారాయణాచారి, సింగిరాల రమేష్, గడ్డం ప్రభాకర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ