తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 9 తెలుగు వెలుగు ), గిరిజన ప్రాంతమైన జూలూరుపాడు మండల గుండెపుడి రెవెన్యూ పరిధిలోని, సీలింగ్ భూమి ని అక్రమ మట్టి తోలకాలు మరియు కంకర మిల్లు నిర్మాణం జరుగుతుందని గిరిజన చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పట్టాలను కొందరు పొందారని అట్టి అక్రమ పట్టా భూమిలో మైనింగ్ అనుమతులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నాటి గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి అక్రమార్కులు పర్యావరణాన్ని, వన్యప్రాణులను, అడవి సంపదను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వ గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా దర్జాగా వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని మట్టి మాఫీ ఆగడాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని గుండెపుడి రెవిన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి ని గతంలో జూలూరుపాడు మండలంలో పనిచేసిన తాసిల్దార్ ఒకరు కాసులకు కక్కుర్తి పడి కొందరు వ్యక్తులకు అక్రమ పట్టాలు చేశారని ఈ విషయమై రెవెన్యూ రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని కొండలు గుట్టలు అక్రమంగా తవ్వుతున్న అక్రమార్కుల నుండి కాపాడాలని, అట్టి భూమిపై అక్రమంగా సొమ్ము చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు గిరిజన సంఘం నాయకులు, గ్రామీణ పేదల సంఘం ఆదివాసి నాయకులు బచ్చల లక్ష్మయ్య తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ