Tuesday, 26 May 2026 11:24:15 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

వేసవిలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అంకిత్ .

Date : 24 April 2026 08:16 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేసవిలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ కార్యక్రమాలు విజయవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, త్రాగునీటి సమస్యలపై వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వివరాలు, కొనుగోలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై అధికారుల నుండి వివరణ తీసుకున్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు, రవాణా సదుపాయాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు రాకుండా చూడాలని సూచించారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పరిష్కారం చూపడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిరంతరంగా తాగునీరు అందేలా చూడాలని సూచించారు. టేకులపల్లి ప్రాంతంలో త్రాగునీటి సమస్య తమ దృష్టికి వచ్చిందని, వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద సోమవారం నుండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, “సే నో టు డ్రగ్స్” కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయాలని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు, గర్భిణీలు, చిన్నారుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, సీజనల్ వ్యాధుల నివారణకు ఫాగింగ్, పరిసరాల పరిశుభ్రత పనులు చేపట్టడం, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పంచాయతీ అధికారి సుధీర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :