Sunday, 19 April 2026 02:03:42 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ...

Date : 09 June 2025 06:22 PM Views : 447

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలీంకో వారి సౌజన్యంతో సామాజిక అధికారిత శివిర్ దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం తెలంగాణ స్కూల్ పాత కొత్తగూడెం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ దివ్యాంగులు వారి తెలివితేటలతో, వారి సామర్థ్యాన్ని బట్టి పనులు చేసుకోని అన్ని రంగాలలో రాణించాలని, వారి దినచర్యలో భాగంగా ఈ సహాయ ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించాలని అన్నారు. గత అక్టోబర్ నెలలో జిల్లాలోని గుండాల, భద్రాచలం, అశ్వరావుపేట, ఐ.డి.ఓ.సి. పాల్వంచ ప్రదేశాలలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరము నిర్వహించడం జరిగింది. ఎంపికైన 440 మంది దివ్యాంగులకు 1057 సహాయ ఉపకరణాలు(విలువ 1.11 కోట్లు) పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, సిపి చైర్స్, చంక కర్రలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో బి.నాగ లక్ష్మి , డిఎంహెచ్వో భాస్కర్ నాయక్, సిడిపిఓ పద్మశ్రీ, ఐ.ఈ.డి శ్రీరామ్, టి.వి.పి.ఎస్. అధ్యక్షుడు సతీష్, డి.సి.పి.ఓ.హరి కుమారి, సఖి అడ్మిన్ శుభ శ్రీ, హబ్ కోఆర్డినేటర్ రూప, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సందీప్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది వరప్రసాద్, నరేష్, ప్రవీణ్, అంగన్వాడి టీచర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :