Wednesday, 15 April 2026 05:19:23 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

“హిందూ సమ్మేళనం” - పోస్టర్ ఆవిష్కరణ, కమిటీ ఏర్పాటు

Date : 12 April 2026 01:01 PM Views : 134

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం 11-04-2026న బస్ స్టాండ్ సెంటర్ సమీపంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా హిందూ సమాజంలో ఐక్యత, ధర్మ రక్షణ, సంప్రదాయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం, యువతలో చైతన్యం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి: అధ్యక్షులు: పి. వీరవర్ధనరావు కార్యదర్శి: లట్టి జగన్ మోహన్ ఉపాధ్యక్షులు: పల్లపోతు వాసు, కంభంపాటి రమేష్, భూపతి అప్పారావు, గోపాల్ పంచారియా సహకార్యదర్శులు: మనీష్ అగర్వాల్, రమాదేవి, బండి భాస్కర్, వారాహి సురేష్ గౌరవ సలహాదారులు: దారా రమేష్, కొదుమూరి శ్రీనివాస్, కృష్ణమూర్తి గురుస్వామి, పలివెల సాంబశివరావు ప్రచార కార్యదర్శులు-- యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశికుమార్ కోశాధికారి: పొన్నం ఉమామహేశ్వరరావు కార్యవర్గ సభ్యులు: కొండవీటి దత్తాత్రేయశర్మ, మెరుగు చింటేశ్వర్, వందనపు శ్రీధర్, సొప్పరి క్రాంతి, జె. తారక్, అప్పారి లక్ష్మణ్, డి.వి.పి యాదవ్, మహేష్ జాజు, రామకృష్ణ, రాజశేఖర్, ప్రదీప్, సిహెచ్ తిరుపాల్ పోస్టర్‌లో పేర్కొన్న విధంగా, ఈ సమ్మేళనం ద్వారా హిందూ సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు మరియు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మహిళలు, హిందూ బంధువులు యువత మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :