తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం 11-04-2026న బస్ స్టాండ్ సెంటర్ సమీపంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా హిందూ సమాజంలో ఐక్యత, ధర్మ రక్షణ, సంప్రదాయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం, యువతలో చైతన్యం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి: అధ్యక్షులు: పి. వీరవర్ధనరావు కార్యదర్శి: లట్టి జగన్ మోహన్ ఉపాధ్యక్షులు: పల్లపోతు వాసు, కంభంపాటి రమేష్, భూపతి అప్పారావు, గోపాల్ పంచారియా సహకార్యదర్శులు: మనీష్ అగర్వాల్, రమాదేవి, బండి భాస్కర్, వారాహి సురేష్ గౌరవ సలహాదారులు: దారా రమేష్, కొదుమూరి శ్రీనివాస్, కృష్ణమూర్తి గురుస్వామి, పలివెల సాంబశివరావు ప్రచార కార్యదర్శులు-- యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశికుమార్ కోశాధికారి: పొన్నం ఉమామహేశ్వరరావు కార్యవర్గ సభ్యులు: కొండవీటి దత్తాత్రేయశర్మ, మెరుగు చింటేశ్వర్, వందనపు శ్రీధర్, సొప్పరి క్రాంతి, జె. తారక్, అప్పారి లక్ష్మణ్, డి.వి.పి యాదవ్, మహేష్ జాజు, రామకృష్ణ, రాజశేఖర్, ప్రదీప్, సిహెచ్ తిరుపాల్ పోస్టర్లో పేర్కొన్న విధంగా, ఈ సమ్మేళనం ద్వారా హిందూ సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు మరియు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మహిళలు, హిందూ బంధువులు యువత మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ