తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2025 2026 సెషన్ కోసం వాక్- ఇన్-ప్రవేకాల కోసం 06-08-2025 నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అని ప్రభుత్వ I.T.I.. Kothagudem ప్రిన్సిపల్ G. Ramesh, ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత:- 10వ తరగతి పాస్ / 8వ తరగతి పాస్ విద్యార్హత ఉన్న వ్యక్తి ఐ టి ఐ లలో ప్రవేశం పొందవచ్చు. అవసరమైన కనీస అర్హత సంబంధిత ట్రేడ్ సిలబస్లో, అలాగే http://iti. Telangana.gov.in వెబ్ సైట్ లో క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) వయస్సు:- విద్యా సంవత్సరం ప్రారంభమైనలేదీ నాటికి అంటే 1-8-2025 నాటికి 14 సంవత్సరాలు నిండిన అభ్యర్ధులు ప్రవేశానికి అర్హులు. క్రాఫ్ట్స్ మెన్ శిక్షణ పథకం కింద కోర్సులో ప్రవేశం కోరుకునే అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి లేదు. ఆసక్తి ఉన్న కొత్త అభ్యర్ధులు వెబ్సైట్లో నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్ధులు మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదు, వారు వాక్- ఇన్కు హాజరు కావాలి. 1వ దశ మరియు 2వ దశలో ఏ టి సి లు/ ఐ.టి.ఐలు ఐటీఐ లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకుని, ఏ ఐటీఐ లోనూ ప్రవేశం పొందని అభ్యర్ధులందరూ నేరుగా ప్రభుత్వ ఐటీఐ/ ఏ టి సి లలో ప్రవేశం కోసం హాజరు కావచ్చు. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకునే అప్లికేషన్కు అదే రోజు మద్యాహ్నం 1.00 తరువాత వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఐటి ఐ కుక్కునూరు పల్లి ప్రిన్సిపల్ ఒక ప్రకటన లో తెలిపారు, ఈ నెల 28వ తేదీ వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని విద్యార్ధి, విద్యార్థినులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ