తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డ్రైనేజీ పై ఉన్న ఆక్రమణలు తొలగించి నేషనల్ హైవే పైకి నీళ్లు రాకుండా చూడాలి డి ఈ రవి కుమార్ కి సమస్యను వివరిస్తున్న కార్పొరేటర్ ముని గడప పద్మ కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ విజ్ఞప్తి మేరకు డివిజన్లో ఉన్న సైడ్ డ్రైనేజీలు, కల్వర్టులు, కిన్నెరసాని మంచినీటి సమస్యలపై పర్యటించి వాటి పరిష్కార మార్గాన్ని చూపించాలని కోరిన వెంటనే స్పందించిన డి ఈ రవికుమార్ 16వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే పక్కన సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ నుండి పాత డ్రైనేజీ మొత్తం పుడుకపోయి, ఆక్రమణలకు గురై చిన్న వర్షం పడితే ఒక చెరువు లాగా జాతీయ రహదారి మారిపోతుందని అధికారులకు వివరించారు. శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఎక్కడ ప్రజలకు సమస్య ఉంటే అక్కడ నిధులు మంజూరు చేయిస్తారని అధికారులకు తెలిపారు. తక్షణమే ఈ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు .అలాగే మార్కెట్ వెనకాల ఒక 10 గృహాలకు సంబంధించిన ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సైడ్ డ్రైనేజీ నీరు బయటికి రాకుండా ఆక్రమణకు గురిచేసి ఒకవైపు మున్సిపల్ రూము, మరొకవైపు ప్రైవేట్ రూము కట్టడంతో డ్రైనేజీ నీరు మునిగిపోయి పురుగులు ఆ గృహాలకు వ్యాప్తిస్తున్నాయని తెలిపారు. తక్షణమే ఈ డ్రైనేజీ నీరు బయటకు వచ్చే మార్గాలను అన్వేషించాలని ఆమె అధికారులను కోరారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారులకు నష్టం జరగకుండా ముందస్తుగా వారికి నోటీసులు అందించి, కాలువ నిర్మాణాన్ని చేపట్టి జాతీయ రహదారిపై నీళ్లు నిలవకుండా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. అలాగే డివిజన్లో 8 కల్వర్టుల నిర్మాణాన్ని చేపట్టాలని ,కిన్నెరసాని మంచినీటి పథకంలో ఏర్పడుతున్న అమంతురాలను అధిగమించి మంచినీటిని అందించాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సైడ్ డ్రైనేజీని పరిశీలించిన వారిలో నాయకులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఏ ఈ బి శ్రీకాంత్ ,వర్క్ ఇన్స్పెక్టర్ కలాం తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ