తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది.03-04-2026 శుక్రవారం నాడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని శ్రీమతి పి. విజయలక్ష్మీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి / కన్వీనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఉ.10:30 ని.లకు కార్యక్రమము ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమమునకు అంకిత్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శ్రీ దొడ్డి కొమరయ్య చిత్రపటమునకు పూల మాలను వేసి, శ్రీ వి. వేణుగోపాల్ జిల్లా అదనపు కలెక్టర్ , సంజీవ రావు, మైనారీటీ సంక్షేమ శాఖ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించినారు. తదుపరి శ్రీ దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర భావితరాలవారికి ఆదర్శనియం అని మరియు వారు చేసినటువంటి పోరాటం, చూపించిన చొరువ నేటితరం వారు అచరించాలని తెలియజేసినారు. ఈ కార్యాక్రమములో దుడల బుచ్చయ్య , సుంక పెద్దాపురం , కంచెర్ల లింగయ్య , బైరి రవి కుమార్ , కె. సాయి కుమార్ , దుడల కిరణ్ మరియు జిల్లా అధికారులు, వసతిగృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది కార్యాక్రమంలో పాల్గొన్నారు. తదుపరి పలువురు బి.సి. నాయకులు ప్రసంగించినారు, కార్యాక్రమము జయప్రదముగా జరిగినదని తెలియచేస్తున్నాము
Admin
తెలుగు వెలుగు టీవీ