తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవపక్షం 2025 లో భాగంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్బంగా/ GST పై మేధావులు,వర్తక, వ్యాపారస్తులతో అవగాహన సదస్సు.భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు హాజరైనరు ఈ కార్యక్రమం కొత్తగూడెం పట్టణంలోని IMA హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కీర్తించడం జరుగుతుంది అన్నారు ముఖ్యంగా పేదలకు,మధ్యతరగతి,చిన్న తరహా పరిశ్రమలకు,నిత్యావసర వస్తువులకు మరియు చిన్న తరహా, మధ్య తరహా,భారీ పరిశ్రమలకు అనేక విధాలుగా జీఎస్టీని తగ్గించి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఈ దేశ ప్రజలు క్రమం తప్పకుండా వినియోగిస్తే భారతదేశం త్వరలోనే ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ధీటుగా తయారవుతుందని అప్పుడు ఈ దేశంలో పూర్తిగా పేదరికం పోతుంది అని అన్నారు, భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్షణం సబ్కా సాత్,సబ్ వికాస్, సబ్కా విశ్వాస్,అని అన్నారు.ముఖ్యఅతిథి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలను మేకిన్ ఇండియా,స్టాండ్ అప్ ఇండియా, వంటి పథకాలతో యువతకు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని రాబోయే రోజులలో భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని దానికి సాక్ష్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న జాతీయ రహదారులు మనందరికీ కనిపిస్తున్నాయి అని అన్నారు, GST విషయంలో తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారని ఇది పేదల ప్రభుత్వమని,ఈ దేశ సంపదను అందరికీ అందేలా చూడడం భారత ప్రభుత్వ బాధ్యత అని దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్రావు, సేవ పక్షం జిల్లా కన్వీనర్ సతీష్ కుమార్, కో- కన్వీనర్ గొడుగు శ్రీధర్ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్, జిల్లా నాయకులు జల్లారప శ్రీనివాస్,ఎమూరి శివ, భద్రాద్రి జిల్లా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు,కొత్తగూడెం వర్తక సంఘం అధ్యక్షుడు కోదుమూరి శ్రీను,వివిధ వర్తక వ్యాపార సంఘ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ