తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణం లోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సింగరేణి కార్మిక ప్రాంతమైన రామవరం ప్రాంతం పోరాటాల గడ్డని ఇక్కడ ఎంతోమంది నాయకులు అనేక సందర్భాలలో ఉద్యమాలు నిర్వహించి అనేక హక్కులు సాధించడం జరిగిందని అన్నారు ఈ కమ్యూనిటీ హాల్ కి పంచాయతీరాజ్ నుండి 10 లక్షల నిధులు మంజూరయ్యాయని వాటితో ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతుందని నిర్మాణం పూర్తి చేసే విధంగా అదనంగా మరో 10 లక్షలు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం రామవరం అంబేద్కర్ భవన్ (మాదిగ సంక్షేమ సంఘం) జిల్లా నాయకత్వం ఎమ్మెల్యే కూనంనేని తో పాటు సాబీర్ పాషా లను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, టూ టౌన్ సిఐ ప్రతాప్, సిపిఐ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, ఎస్.కె ఫయుం, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాస్,మర్రి గోపికృష్ణ, తూముల శ్రీనివాస్, పేయ్యాల రంగారావు, గుత్తుల శ్రీనివాస్,ఎస్.కె ఖయ్యూం, పాటి మోహన్, షాహిన్, మద్దెల విజయలక్ష్మి, జహీర్, రణధీర్, రసూల్ ,మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా నాయకులు మాతంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, కూరగాయల శ్రీను, సిహెచ్ కుమారస్వామి, సావటి స్వామి,కంపెళ్ళి దుర్గయ్య , కొత్తూరు రవి, మాటేటి అంజయ్య, చాట్ల హనుమంతు, ఓడ్డూరి హరిబాబు, గడ్డం రాజశేఖర్, మధు కృష్ణ, మద్దికుంట గణేష్, కొత్తూరు చుక్కయ్య, ఆవునూరి చంద్రయ్య, ఇల్లందుల పోచయ్య, కే.నర్సయ్య నాగేల్లి రామకృష్ణ, నమిల్ల శేఖర్, శ్యాం బాబు, అన్నవరం నాగుల మీరా, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ