తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ తో పాటు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని,భూమి కోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ,పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు.ఇలాంటి పోరాట యోధుల ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ భాద్యతగా నడుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్బి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు సుధాకర్, నరసింహారావు, రవి,లాల్ బాబు, కృష్ణారావు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ