తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని స్పష్టం- మిరియాల రంగయ్యా.శనివారం సాయంత్రం కొత్తగూడెం ఏరియా లో జిఎం కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో జిఎంకి మెమొరాండం అందచేశారు,అనంతరం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా, మాట్లాడుతూ కమిటీల పేరుతో యాజమాన్యం కాలయాపన చేయవద్దని విజ్ఞప్తి చేశారు,ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వలన కార్మికులు అనారోగ్య కారణాల వలన ఉద్యోగం చేయలేక పోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇంటి పథకం,మారుపేర్ల సమస్య, పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ కోలిండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని,అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని, సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా విడుదలచేసిన 150 మస్టర్ల సర్క్యులర్ నీ వెంటనే రద్దు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని, మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగ నియామకప్రత్రాలు ఇవ్వాలని,వీకే కోల్ మైన్ లో పర్మినెంట్ ఉద్యోగాలతోనే బొగ్గు వెలికితీత తియ్యాలనీ డిమాండ్ చేశారు, ఎఐటియుసి నిత్యం కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కులు సాధించడంలో ముందు ఉంటుందని అన్నారు,అదేవిధంగా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు,కార్యక్రమాల్లో, సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్, సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు,క్రిస్టోఫర్,సామల రాము, పిట్ కార్యదర్శిలు,మధుకృష్ణ, కమల్, సుధీర్,సురేందర్, సౌజన్య,సీనియర్ నాయకులు కత్తర్ల రాములు,రాజాలపూడి సాంబమూర్తి, సురేందర్, సురేష్, మింగిన్ రవి,బండి వెంకటరమణ,కర్రు రమేష్, మెంగన్ రవి, కోటి, మురళి, గుమ్మడి, ఓం ప్రకాశ్, సాయిపవన్, భుక్య రమేష్ ,బండి వెంకటరమణ, బండారి మల్లయ్య, రాజేశ్వరరావు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ