తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్ (మాదిగ సంక్షేమ సంఘం) ఆధ్వర్యంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 39 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు కొత్తూరు మదనయ్య, జంగం కృష్ణ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి ఉప ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు అనేక సేవలు చేసి అనగారిన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తూ సామాజిక న్యాయం కోసం 1935 లో "ఆల్ ఇండియా డిప్రెసెడ్ క్లాసెస్ లీగ్" ఏర్పాటు చేసి అనేక మందిని జాగ్రత్త చేయడం జరిగిందని, 1937 లో అతి చిన్న వయసులో బీహార్ నుండి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగిందన్నారు. ఈ దేశంలోనే పార్లమెంటులో 40 ఏళ్లుగా అనేక రంగాల్లో మంత్రి పదవిని చేపట్టిన ఏకైక వ్యక్తి అని తెలిపారు. 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న జగ్జీవన్ రామ్ చాకచక్యంగా వ్యవహరించి బాంగ్లాదేశ్ ఏర్పడడంలో తోడ్పడ్డారు అన్నారు. జగ్జీవన్ రామ్ కుమార్తె అప్పటి పార్లమెంట్ స్పీకర్ మీరా కుమారి 2014లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారని ఈ సందర్భంగా భూపేష్ అన్నారు. జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా నాయకులు తిప్పారపు ఎల్లయ్య, మద్దికుంట గణేష్, నమిల్ల మధు, వెంకట్రావు, ఇల్లందుల పోచయ్య, ఎం రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ