Monday, 20 April 2026 03:01:07 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సామాజిక సమానత్వానికి బసవేశ్వరుడి బోధనలు మార్గదర్శకం - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 20 April 2026 01:37 PM Views : 10

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం శ్రీ బసవేశ్వరుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బసవేశ్వరుడు జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని అన్నారు . సమాజంలో వర్ణ వివక్ష నిర్మూలనకు, దళిత, బహుజన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశిష్టమని తెలిపారు. సమానత్వం, న్యాయం, శ్రమకు గౌరవం వంటి విలువలను బసవేశ్వరులు బోధించినట్లు చెప్పారు. బసవేశ్వరుడు చిన్న వయస్సులోనే శైవ సాంప్రదాయాలపై అవగాహన సాధించి కర్మకాండాలపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉపనయనం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి కూడల సంగమానికి చేరి సంగమేశ్వరుని భక్తితో ఆరాధించినట్లు పేర్కొన్నారు. ఆయన స్థాపించిన “అనుభవ మండపం” అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను వ్యక్తపరచుకునే వేదికగా నిలిచిందన్నారు. మనుషులందరూ ఒక్కటే”, “దేహమే దేవాలయం”, “స్త్రీ-పురుష భేదం లేదు”, “శ్రమకు మించిన సౌందర్యం లేదు” అనే బసవేశ్వరుల సందేశాలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువత ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారివిజయలక్ష్మీ, ఎ.డి. మైన్స్ జి. దినేష్, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. ఉపేందర్, యువజన శాఖ పరందామ రెడ్డి, గుమలాపురం సత్యనారాయణ, ముదురుకోళ్ళ కిషోర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :