Sunday, 19 April 2026 05:56:17 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రభుత్వం మెచ్చిన జిల్లా ఏజెన్సీ ఆసుపత్రి సేవలు. ఏజెన్సీ లో స్ఫూర్తిదాయక సేవలు అందిస్తున్నారని మంత్రి దామోదర.

Date : 19 December 2025 07:12 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డి సి హెచ్ ఎస్ డా.రవి బాబు, చర్ల ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేక ప్రశంస. డి సి హెచ్ ఎస్ బృందాన్ని రాష్ట్ర సచివాలయానికి పిలిచి ప్రత్యేకంగా అభినందించినా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర, ప్రధాన కార్యదర్శి క్రిస్టినా.భద్రాద్రి జిల్లా లో ని ఏజెన్సీ ప్రాంతాల్లో టీవీవీపీ ఆసుపత్రులలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, సిబ్బంది చాలా అంకిత భావం తో మెరుగైన పనితీరు కనబరిచి, ఇతర జిల్లాలకి స్ఫూర్తి దాయకంగా సేవలు అందిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహా భద్రాద్రి జిల్లా టీవీవీపీ ఆసుపత్రుల పనితీరు పై ప్రశంసలు కురిపించారు. డీ సి హెచ్ ఎస్ డా రవి బాబు తో పాటు చర్ల , మణుగూర్, భద్రాచలం, ఎల్లందు , అశ్వారావుపేట ఆసుపత్రుల సిబ్బంది ని సచివాలయానికి ఆహ్వానించి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తో కలిసి జ్ఞాపికలు అందించి అభినందనలు తెలియజేశారు.చర్ల లాంటి మారుమూల ప్రాంతంలో లో సైతం అందుబాటులో ఉన్న వసతులతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని, చర్ల స్ఫూర్తితో ఇతర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోనిరావడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇటీవల చర్ల ఆసుపత్రిలో లో వైద్య సదుపాయాల పై జాతీయ పత్రికలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మంత్రి భద్రాద్రి ఏజెన్సీ లోని ఆసుపత్రుల సేవలపై స్పందించారు. ఆసుపత్రుల సూపరింటెండ్లు వారి సిబ్బంది చాలా కష్టపడి నిబద్ధత తో పనిచేస్తున్నారని, జిల్లాలోని నలుమూలల ఆసుపత్రుల బాగా అభివృద్ధి చెందాయని, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఎన్నో సవాళ్లని ఎదుర్కొని జిల్లా లోని అన్ని ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు అందించే దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకి నమ్మకం కలిగేలా చేసిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి రవి బాబు ని ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :