తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 30 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు( SHVR)స్వచ్ఛ్ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్'. ఇది విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన ఒక దేశవ్యాప్త కార్యక్రమం. దీని లక్ష్యం ప్రతి పాఠశాలను పరిశుభ్రత, పచ్చదనం, మరియు పర్యావరణ స్పృహ విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో జూలూరుపాడు మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలను శుభ్రత, పర్యావరణం మరియు పచ్చదనం వైపు మలచడం ఉపాధ్యాయులందరి బాధ్యత. ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించడం, వ్యర్థాలను వర్గీకరించి తడి పొడి చెత్తను డస్ట్ బిన్ ల ద్వారా వేరు చేయడం అవసరమని. విద్యార్థులు పచ్చదనం వైపు అడుగేయడం ద్వారా సమాజ మార్పును కాంక్షించడం అవసరమని మరియు SHVR యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పాఠశాల యొక్క పరిశుభ్రత మరియు పచ్చదనంకు సంబంధించిన 60 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాటికి సంబంధించిన నోట్ క్యాంప్ ఫొటోస్ ను యాప్ లో అప్లోడ్ చేయాలని దీని ద్వారా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే స్వచ్ఛత పోటీలలో పాఠశాల రేటింగ్ ద్వారా ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎం ఓ జుంకీలాల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సంజీవ, మీరా సాహెబ్, టి లక్ష్మీనరసయ్య వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,RP దేవేందర్ పాల్గొనడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ