Thursday, 25 June 2026 08:07:54 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి – బీజేపీ కిసాన్ మోర్చా

Date : 22 June 2026 03:17 PM Views : 46

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ, వానాకాలం (ఖరీఫ్) సీజన్-2026 ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేదని విమర్శించారు. విత్తనాల విత్తకం నుండి పంటల కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం అనుసరించబోయే విధానంపై రైతులకు స్పష్టత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయాలి, ఎరువుల లభ్యత ఎంత మేరకు ఉంటుంది, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎలా ఉంటుందనే అంశాలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా పత్తి, మిర్చి, వరి విత్తనాల పేరుతో కొందరు ప్రైవేట్ డీలర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రబీ సీజన్‌కు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా నిధులు మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రూ.2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎరువుల పంపిణీని యాప్ ఆధారంగా కాకుండా నేరుగా రైతులకు అందించే విధానం చేపట్టాలని, యూరియా మరియు ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు మరియు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, గొట్టిపూళ్ల దుర్గా శ్రీనివాసు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రవీందర్, సముద్రాల గాయత్రి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, బలగం శ్రీధర్, నవీన్, తెల్లం నరసింహారావు, నిమ్మటూరి రామారావు, బానోత్ కుమార్, గడ్డం అజయ్ కుమార్, భూక్య మోహన్ తదితర బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :