Sunday, 19 April 2026 02:16:34 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జర్నలిస్టుల అక్రమ అరెస్టులుహేయమైన చర్య జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరైంది కాదు. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 14 January 2026 06:11 PM Views : 175

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టు హేయమైన చర్య అని, జర్నలిస్టుల అక్రమ అరెస్టును,ఎన్టీవీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నామని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని అంతేకాని ప్రశ్నించే వారిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్దరాత్రి అరెస్టులు చేయడం,జర్నలిస్టులను వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం జర్నలిస్టుల ఇళ్ళ తలుపులు బద్దలు కొట్టడమేంటని ప్రశ్నించారు.ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏడవ హామీ ప్రజాస్వామ్యం అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేకుండా పాలన కొనసాగుతోందని విమర్శించారు.ఎటువంటి నోటీసులు,సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి సోదాలు నిర్వహించడం లాంటి దుర్మార్గపు చర్యలను మానుకోవాలన్నారు.మీడియా సంస్థలను భయపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుందని,సిట్ వేసిన ప్రభుత్వం సిట్ విచారణ జరగకముందే అరెస్టు చేసిన ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :