తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 తెలుగు వెలుగు) రేపు ఉదయం 10.30 గంటలకు జూలూరుపాడు మండలం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు “ భూభారతి చట్టం ” గురించి రైతులకు అవగాహన సదస్సు జరుగుతుందని తాసిల్దార్ స్వాతి బిందు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రైతులందరికి భూభారతి చట్టం లోని కీలక అంశాలు: రికార్డు లలో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్, వారసత్వం గా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి రిజిస్ట్రేషన్, సాధాబైనామాల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, గ్రామ రెవిన్యూ రికార్డులు తదితర అంశాలు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వైరా అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. కావున ఇట్టి కార్యక్రమం లో రైతులు అందరు పాల్గొని భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించు కోగలరని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ