Friday, 19 June 2026 06:50:33 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుని పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 04 November 2025 06:11 PM Views : 394

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుల పాత్ర మరియు వారి కృషి కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం సుజాతనగర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించారు. స్వచ్ఛత కాంపైన్ 5.0 కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన శుభ్రతా చర్యల గురించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ రోజున పాఠశాలలో ఏ ఏ పనులు చేపట్టారు అని ఉపాధ్యాయులను అడిగి , ఈ రోజున చేయవలసిన పనులు సక్రమంగా జరగకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వం చేపడుతున్న ప్రతి విద్యా కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల సమన్వయంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో, తల్లిదండ్రుల సహకారంతో అమలు చేసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాల అభివృద్ధి అనేది కేవలం భవన నిర్మాణం లేదా వసతుల పెంపు కాదు, అది ఒక సమగ్ర ప్రక్రియ. అందులో ప్రధానోపాధ్యాయుడు కీలక నాయకత్వ పాత్ర పోషించాలి. విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ ప్రధానోపాధ్యాయుని దిశానిర్దేశంపై ఆధారపడి ఉంటాయి, అని అన్నారు.పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించిన కలెక్టర్, కొన్ని టాయిలెట్లు మూసివేసి తాళం వేసి ఉంచినట్లు గమనించి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అందుబాటులో ఉన్న వసతులను వినియోగించకపోవడం నిర్లక్ష్యమని పేర్కొని, వెంటనే టాయిలెట్లను తెరిచి మరమ్మతులు పూర్తి చేయాలని పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.త్రాగునీటి సౌకర్యం తగిన విధంగా లేని విషయం గమనించిన కలెక్టర్, పాఠశాలలో కొత్త బోర్ వేయడం కోసం తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని విద్యాశాఖాధికారి మరియు మిషన్ భగీరథ ఈ ఈ కు ఆదేశించారు. విద్యార్థులకు నిరంతరంగా శుద్ధమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇది పీఎం శ్రీ పాఠశాల కావడంతో, ఆటస్థల అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి, విద్యార్థుల క్రీడా ప్రతిభను పెంపొందించే దిశగా అన్ని ఆటలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని, క్రమశిక్షణతో పాటు సమూహ భావన కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాల ప్రాంగణం బయట నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రంను కూడా ఆయన పరిశీలించారు. భవనం చాలా లోతులో నిర్మించబడినందున వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉందని గమనించి, సరైన ఎత్తు పెంచి మిగతా నిర్మాణ పనులు కొనసాగించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భవిత కేంద్రాలు పాఠశాలలకు విలువైన వనరుల కేంద్రాలుగా మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, కాబట్టి వాటి నిర్మాణం నాణ్యతతో కూడినదిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.కలెక్టర్ ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మరియు విద్యార్థుల ప్రతిభను పెంపొందించే పద్ధతులపై చర్చించారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల స్థాయిలో మార్పు తీసుకురాగలడని, వారి కృషితోనే ప్రభుత్వ పాఠశాలలు మరింత ఆదర్శవంతమైనవిగా మారుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :