Sunday, 19 April 2026 02:13:42 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెంలో విస్తృతంగా పంద్రాగస్టు వేడుకలు పాల్గొన్న కంచర్ల చంద్రశేఖర్, నాగ సీతారాములు...

Date : 15 August 2024 03:20 PM Views : 296

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం- ఆగస్టు 15. (తెలుగు వెలుగు) భారత స్వాతంత్ర పోరాటంలో వీరుల పోరాట సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కొత్తగూడెంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన జెండావిష్కరణ వేడుకల్లో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ప్రయాణం అపారమైన త్యాగం, ధైర్యం, ఐక్యతతో నిండిన మార్గంలో సాగిందన్నారు. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు స్వాతంత్ర్య సమరయోధులు, భారతీయ ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, అయినా సరే వారు వెనక్కి తగ్గకుండా పరాయి పాలన నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ దేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి వారు ఎన్నో కష్టాలు పడ్డారని మరెన్నో త్యాగాలు చేశారన్నారు. మన స్వాతంత్ర్య కోసం పోరాడిన ఎంతోమంది ధైర్యవంతుల కారణంగానే మనం ఈనాడు స్వేచ్ఛగా ఉన్నామని భగత్ సింగ్, రాణీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది వీరులు తమ జీవితాలను మన దేశ స్వాతంత్ర్య కోసం అంకితం చేశారని వారి సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మన దేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలిసిన భూమి. అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నామని, మన ఐక్యతే మనకు బలమని, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందామని, మహాత్మా గాంధీ మనకు అహింసా, సత్యానికి ఉన్న శక్తిని బోధించారు. కాబట్టి అహింసా, సత్యాన్ని వీడకుండా శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మన వంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందనీ అయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ళ మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా,మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :