తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 18 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూలూరుపాడు మండల అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి ఆధ్వర్యంలో ప్రధాన రహదారి మండల కార్యాలయ రహదారి నుండి పోలీస్ స్టేషన్ వరకు 2కె రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి, ఎంపీవో తులసిరామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, సర్పంచులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చురుకుగా ఆరోగ్యకరంగా ఉండాలంటే రోజువారి పనులలో భాగంగా వ్యాయామం తప్పనిసరి అని అన్నారు.ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పథకాల పనితీరు ఆదర్శనీయమని ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రజల ఆదరణే కారణమన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ