తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం శేషగిరి భవన్ లో జాతీయ సంఘాల అఖిలపక్షం అత్యవసర సమావేశం నిర్వహించి సింగరేణి పరిరక్షణకై భవిష్యత్తు కార్యాచరణకై మాట్లాడుకున్నారు,అన్ని ప్రజా,కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను,కోల్ బెల్ట్ శాసనసభ్యుల తో కలిసి పోరాటాలు, ఉద్యమాలు తప్పవని తెలిపారు, మణుగూరు లోని పికే ఓసి డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకును ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే బొగ్గును బంద్ చేపిస్తాం స్పష్టం చేశారు,దాన్ని సింగరేణికే బొగ్గు గనులను కేటాయించాలి డిమాండ్ చేశారు,ప్రైవేటు బొగ్గు బ్లాక్ టెండర్ వచ్చినా అడ్డుకుంటాం తెలిపారు, యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్ లను సింగరేణి కి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటాంఅని అఖిలపక్షం నాయకులు తెలిపారు,కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ఆదాని గ్రూప్, ఏ.ఎం.ఆర్, మెగా క్రిషా రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన జెన్ కో,సంస్థలు టెండర్ లో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తే సహించబోం అన్ని జాతీయ సంఘాల నాయకులు స్పష్టం చేశారు,సింగరేణి బొగ్గు బ్లాక్స్ ప్రైవేటు కు వెళితే మణుగూరు మతియు సింగరేణి మనుగడ కుంటుపడుతుందని, కార్మికులు,అధికారులు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని అన్నారు, సింగరేణికి చెందిన బొగ్గు గనులు దక్కాలంటే కోల్ బెల్ట్ ఎమ్మెల్యే లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి చేయాలని కోరారు, అదేవిధంగా సింగరేణి లో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, యూనియన్ లు చేసిన పోరాటాలను స్పూర్తి తో సింగరేణి లో ఉద్యమాలు చేయడం వల్ల సింగరేణి మనుగడ కొనసాగుతుంది అని అన్నారు,సింగరేణి పరిరక్షణకై అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా,కార్మిక సంఘాలను కలుపుకొని సకలజనుల సమ్మేకు పిలుపునిస్తాం సింగరేణి జాతీయ సంఘాల అఖిలపక్షం నాయకులు తెలిపారు,డిసెంబర్ 19న గోదావరిఖని భాస్కర్ భవన్ లో అన్ని రాజకీయ,ప్రజా, జాతీయ,కార్మికసంఘాలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం,ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య,కొరిమి రాజకుమార్,వంగ వెంకట్, రాంగోపాల్,రమణమూర్తి,వీరస్వామి,లక్ష్మీనారాయణ, సందబోయిన శ్రీనివాస్,బండారి మల్లయ్య,మండల రాజేశ్వరరావు,నితిన్ కుమార్ ఐ ఎన్ టీ యు సి నాయకులు త్యాగరాజన్,ఆల్బర్ట్,పితంబరం,శ్రీనివాస్,చిన్ని, టి బి జి కే ఎస్ నాయకులు కాపుకృష్ణ, కుసాన వీరభద్రం, నాగెల్లీ వెంకటేశ్వర్లు,తుమ్మ శ్రీను,వశికర్ల కిరణ్, సి ఐ టి యు నాయకులు,మంద నర్సింహారావు,రాజారావు, సురం ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ