Friday, 24 April 2026 03:09:00 PM
# హిందూ సమ్మేళనానికి జిల్లా ఎస్.పి రోహిత్ రాజ్ కి ఆహ్వానం. # కొత్తగూడెం ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత పరిచయ కార్యక్రమం. # పాల్వంచలో లేడీస్ జిమ్ & జుంబా స్టూడియో ఏర్పాటు. ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # సీతారామ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి తిరుగుండదు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె. # క్రీడల్లో గెలుపోటములు సహజం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # మెరుగైన సేవలు కొరకే ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే జారె. # వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: టిజిఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్ రెడ్డి. # స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల.

పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు

Date : 22 April 2026 12:11 PM Views : 302

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామీణ ప్రాంత ప్రజలు, హిందువుల ఆరాధ్య దైవమైన పోచమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పోచమ్మ తల్లి విగ్రహాన్ని, ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి వారిని వదిలి పెట్ట వద్దని పోలీసులు కోరినట్లు తెలిపారు. చుంచుపల్లి మండల పరిధిలోని కార్మిక ప్రాంతంగా ఉన్న గౌతమ్ పూర్ లోని పోచమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేయడం విచారకరమన్నారు. మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు అందరిని కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామన్నారు. దీనికి కారకులైన వారిని వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. దేవాలయాలను ధ్వంసం చేసే విధంగా కొంతమంది దుండగులు పాల్పడటం విచారకరమన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోచమ్మ తల్లిని గ్రామదేవతగా కొలిచే ఆనువాయితీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగిన పోచమ్మ తల్లికి పూజలు చేసినా అనంతరమే కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈరోజు చిన్న ఆలయమే కదా అని వదిలేస్తే రేపు పెద్ద దేవాలయాలు కూడా ముప్పు పొంచి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను వదిలి పెట్టవద్దని ఎస్పీకి అందించిన వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జాతోత్ వెంకన్న, బలగం శ్రీధర్, పొన్నకంటి రాజు, బడే రమేష్, మంగిలాల్ స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :