తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి తరగతుల ప్రారంభించడానికి ప్రభుత్వము నుండి అనుమతి వచ్చిన సందర్భంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఈ 21 పాఠశాలల పరిధిలోని నాలుగు సంవత్సరాలు నిండిన బాల బాలికలను ప్రీ ప్రైమరీ తరగతులలో జరిపించడానికి మండల విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ పిల్లలకు కావలసిన యూనిఫామ్, పుస్తకాలు, క్రీడా పరికరాలు, అందించనున్నామని, పాఠశాలను రంగులతో ఆకర్షణీయంగా తయారు చేసి పిల్లలను ఆకర్షించాలని అన్నారు. ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనం అదేవిధంగా అల్పాహారం కూడా అందించనున్నామని కలెక్టర్ తెలిపారు. పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి వారికి కావలసిన వైద్య సహాయం కూడా అందించడానికి ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పిల్లలకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో మండల విద్యాశాఖ అధికారులు ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని, ప్రతి పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలు ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసి పిల్లలను ఒక పండగ వాతావరణం లో పాఠశాలల్లో చేర్పించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి.నాగలక్ష్మి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లేనినా, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ