తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు భారత రాజ్యాంగ నిర్మాత,దళిత హక్కులకు మార్గదర్శకుడు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్యం నుండి కులవ్యవస్థను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రముఖ భారతీయ న్యాయవాదిగా,ఆర్థిక శాస్త్రవేత్తగా,రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా అంబేద్కర్ ఎదిగారని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని,విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా అతి పెద్ద ప్రజస్వామ్య భారత రాజ్యాంగాన్ని తన ఆద్వర్యంలో రచించి దిశానిర్దేశం చేశారని అన్నారు.స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి నేటి యువతకు అదర్శంగా నిలిచిన మహానీయుడని కొనియాడారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీఐలు ప్రతాప్,వెంకటేశ్వర్లు,ఇంద్రశేనారెడ్డి,కరుణాకర్,ఆర్ఐలు సుధాకర్,రవి,నరసింహారావు,లాల్ బాబు,కృష్ణారావు మరియు ఎస్సైలు జి.ప్రవీణ్,జె.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ