తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 21 తెలుగు వెలుగు) : భద్రాద్రి జిల్లా ఉష్ణోగ్రతలు తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు మండల ప్రజలను ఉద్దేశించి ఎంపీవో తులసిరామ్ పలు సూచనలు సూచించారు. అత్యవసర సమయాలలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగులు, చేతి రుమాలు, టవల్స్ వినియోగించాలని బయట పదార్థాలు తినకూడదని, ఎక్కువగా నీళ్లు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని వడదెబ్బ తలిగే అవకాశం ఉందన్నారు ఎండల తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో నీటి కొరత లేకుండా తగు చర్యలు చేపట్టామని అన్ని పంచాయతీలలో సర్పంచులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారని, ఆరోగ్య ఉప కేంద్రాల లలో గ్రామ ప్రజలకు సరిపడా ఓఆర్ఎస్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు వినియోగించు కోవాలన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ