Friday, 19 June 2026 02:59:52 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

Date : 14 June 2026 06:24 PM Views : 145

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 12 ఏళ్ల కాలంలో ప్రధాని "మోడీ" సాధించిన విజయాలను ప్రచారం చేయాలి. రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. 12 ఏళ్ల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఇన్చార్జి ఉదయ్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయుచున్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రామలింగేశ్వర రావు సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయన మాట్లాడారు.12ఏళ్ల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయాలు, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాయన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జిల్లాలో అధికారమే లక్ష్యంగా బిజెపి శ్రేణులు పని చేస్తామని పేర్కొన్నారు. అయితే భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ పని పూర్తి చేసిన ఘనత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదేమన్నారు. అన్నారు. అంతేగాక ఉజ్వల యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా స్టాండప్ ఇండియా తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ప్రధానమంత్రి మోడీదేనని వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని అమలు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ రాముడి దేవాలయ అభివృద్ధికి రు.98 కోట్ల ఖర్చు చేసిన ఘనత కేంద్రంలో బిజెపి ప్రభుత్వానిదేనన్నారు. అంతేగాక మోడీ చొరవేనని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి గానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. భద్రాచల శ్రీ రాముని ఆలయ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన లేదని విమర్శించారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం గత పాలకుల కంటే కూడా ఎంతో ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా జిల్లాకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా అదే పనిగా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో చిన్నారిపై ఒక ముస్లిం యువకుడు దారుణానికి వడిగడితే కనీసం స్పందించడానికి మనసు రాని చేతకాని ప్రభుత్వమని విమర్శించారు.ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులని తీవ్రస్థాయిలో విమర్శించారు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మంత్రులు ఎవరు కూడాను నోరు మెదపని పరిస్థితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీని విమర్శించే ప్రభుత్వాలు ఏ విధంగా అధికారానికి దూరమయ్యాయో వివరించారు. ముఖ్యంగా రాబోవు రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, భోగి కృష్ణ, పుణ్యం బిక్షపతి, కార్యదర్శులు తుం పూరిశివ, పుణ్యా నాయక్, ఎస్ఐఆర్ కన్వీనర్ మోహనకృష్ణ,మీడియా కన్వీనర్ రామారావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి దురిశెట్టి కుమార్, మహిళా నాయకురాలు సముద్రాల గాయత్రి, పద్మ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: