తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 12 ఏళ్ల కాలంలో ప్రధాని "మోడీ" సాధించిన విజయాలను ప్రచారం చేయాలి. రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. 12 ఏళ్ల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఇన్చార్జి ఉదయ్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయుచున్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రామలింగేశ్వర రావు సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయన మాట్లాడారు.12ఏళ్ల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయాలు, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాయన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జిల్లాలో అధికారమే లక్ష్యంగా బిజెపి శ్రేణులు పని చేస్తామని పేర్కొన్నారు. అయితే భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ పని పూర్తి చేసిన ఘనత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదేమన్నారు. అన్నారు. అంతేగాక ఉజ్వల యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా స్టాండప్ ఇండియా తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ప్రధానమంత్రి మోడీదేనని వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని అమలు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ రాముడి దేవాలయ అభివృద్ధికి రు.98 కోట్ల ఖర్చు చేసిన ఘనత కేంద్రంలో బిజెపి ప్రభుత్వానిదేనన్నారు. అంతేగాక మోడీ చొరవేనని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి గానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. భద్రాచల శ్రీ రాముని ఆలయ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన లేదని విమర్శించారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం గత పాలకుల కంటే కూడా ఎంతో ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా జిల్లాకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా అదే పనిగా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో చిన్నారిపై ఒక ముస్లిం యువకుడు దారుణానికి వడిగడితే కనీసం స్పందించడానికి మనసు రాని చేతకాని ప్రభుత్వమని విమర్శించారు.ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులని తీవ్రస్థాయిలో విమర్శించారు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మంత్రులు ఎవరు కూడాను నోరు మెదపని పరిస్థితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీని విమర్శించే ప్రభుత్వాలు ఏ విధంగా అధికారానికి దూరమయ్యాయో వివరించారు. ముఖ్యంగా రాబోవు రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, భోగి కృష్ణ, పుణ్యం బిక్షపతి, కార్యదర్శులు తుం పూరిశివ, పుణ్యా నాయక్, ఎస్ఐఆర్ కన్వీనర్ మోహనకృష్ణ,మీడియా కన్వీనర్ రామారావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి దురిశెట్టి కుమార్, మహిళా నాయకురాలు సముద్రాల గాయత్రి, పద్మ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ