తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 20 (తెలుగు వెలుగు) : రామవరం పరిరక్షణ కమిటీ చేపట్టిన నేను సైతం కార్యక్రమంలో భాగంగా గరిమెళ్ళ పాడు గిరిజన బిడ్డలకు ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ సహకారంతో ఏడు కుటుంబాలకు ఉపాధినివ్వడం జరిగినది కబ్రిస్తాన్ ఈద్గా కబ్రిస్తాన్ అధ్యక్షులు ఫహీమ్ దాదా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ముస్తఫా మాట్లాడుతూ నేడు మనమందరం కులమతాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణం ఏర్పడింది గరిమెళ్ళపాడు ఉపాధి లేక వలస కూలీలుగా మారడం ఎంతో బాధాకరమైన విషయం పూర్వ వైభవానికి మనమందరం కలిసి గరిమెళ్ళ పాడు గిరిజన బిడ్డలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే కృషి చేస్తామని వారు చెప్పారు సుమారు 72 ఎకరాల స్థలం ఈరోజు నిర్వీర్యం అవ్వడం ఎంతోబాధాకరమైన విషయమని చెప్పారు ఉభయ రాష్ట్రాలకు ఈ ప్రాంతం నుండి లక్షలలో మొక్కలు సరఫరా జరిగేది వంద కుటుంబాలకు ఉపాధి దొరికేది పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చేవి ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని గరిమెళ్ళ పాడు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ షమ్మీ, సెక్రెటరీ రసూల్, ఉపాధ్యక్షులు ఖయ్యుమ్,జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ గౌస్, మొయినుద్దీన్, వెంకటేశ్వర్లు, రాధా, సుజాత, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ