తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 12 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో వెలసి యున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ తల్లుల జాతర తేదీలను నిర్వాహకులు ఖరారు చేశారు. గత 24 ఏండ్లుగా రెండేల్లకు ఒక్కసారి జరిగే మేడారం పెద్ద జాతరకు వారం రోజులు ముందుగా మన జూలూరుపాడు మండలం లో నిర్వహించే నర్సాపురం మినీమేడారం జాతర ను ఈనెల 21, 22, 23 తేదీలలో నిర్వహిస్తున్నట్లు జాతర నిర్వహణ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున పరిసర ప్రాంత ప్రజలందరూ కుటుంబ సమేతంగా జాతరకు తరలివచ్చి ఆదివాసి వనదేవతలైన శ్రీ సమ్మక్క- సారక్క తల్లులను దర్శించుకొని, మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందాలని కోరారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు జరిగే జాతర కార్యక్రమాల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. పరిసర ప్రాంత ప్రజలంతా భారీ సంఖ్యలో జాతరకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ