తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెనుబల్లి గ్రామపంచాయతీ సందర్శన సందర్భంగా అక్కడి ప్రజల సమస్యలను గడపగడప తిరిగి స్వయంగా తెలుసుకున్నారు. ప్రధానంగా ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులైన అనేక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు మాత్రమే ఇచ్చి మోసం చేసిన విషయాన్ని ఆయన ఎత్తిచూపారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, పెనుబల్లి గ్రామంలో పూరి గుడిష లో డేరాలతో కష్టాలు పడుతున్న పేదలకు ఇచ్చిన పట్టాలు కేవలం పేరుకే తప్ప, వాస్తవంలో ఏ ఉపయోగమూ లేకుండా అయిపోయింది “అప్పడ తుంగలో తొక్కడానికి మాత్రమే పనికొచ్చేలా” ఉన్నాయని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తూ,“అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసి, నిర్మాణం జరిగేలా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. లేకపోతే బీజేపీ ఎంతటికైనా ప్రజల కోసం పోరాటానికి సిద్ధమవుతుంది” అని స్పష్టం చేశారు. ఇందులో పాల్గొన్నవారు కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ తిమ్మిరి నరేందర్ బాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొనగంటి రాజు, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ , బిజెపి సీనియర్ నాయకులు బడే రమేష్, చుంచుపల్లి మండల మహిళ అధ్యక్షురాలు జిల్లా స్వప్న, చుంచుపల్లి మండల మహిళ ఉపాధ్యక్షురాలు భూలక్ష్మి, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శులు బుర్ర సతీష్ కుమార్, రతన్ లాల్ పాసి, మండల సెక్రెటరీ గంటా శ్రీను, చుంచుపల్లి మండల యువమోర్చా అధ్యక్షులు& సోషల్ మీడియా కన్వీనర్ కోల హరీష్, మరియు పెనుబల్లి గ్రామస్తులు వెంకటేశ్వర్లు, గోపాల్, రాంబాబు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ