తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కుటుంబ కలహాలతో మానసిక ఒత్తిడికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామంలోని ఎర్రగడ్డలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నివాసి అయిన దొంతరబోయిన కామేశ్వరరావు గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని 2 టౌన్ SI బండారి కిషోర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ