Sunday, 19 April 2026 02:24:09 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 30 July 2025 04:53 PM Views : 508

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని జగన్నాధపురం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు ఓపీ, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ గదులను పరిశీలించారు.అనంతరం ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరును పరిశీలించి, విధి నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శించకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులను పర్యవేక్షిస్తూ , వారికి అందుబాటులో ఉన్న మందుల గురించి తెలుసుకున్నారు. రోగులతో ప్రత్యక్షంగా మట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? మందులు ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పట్ల అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది అని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలని ఆదేశించారు. అన్ని రకాల అవసరమైన మందులు, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా స్టాక్ పూర్తయ్యేలోపే ముందుగానే ఇండెంట్ చేసి తెప్పించుకోవాలని సూచించారు. ఎక్స్‌పైర్ అయ్యే ఔషధాలపై అప్రమత్తంగా ఉండాలని, అవి ఆసుపత్రిలో నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రత్యేకంగా వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్ల చికిత్సకు అవసరమైన మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. గర్భిణీల వివరాలు నిబంధనల ప్రకారం ఆన్లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.అంతేకాకుండా, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట డాక్టర్ రాజు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :