తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (రామవరం) : స్వార్ధం లేని ప్రేమకు తల్లి ప్రేమ ప్రతీక అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. పట్టణంలోని రామవరం సెంటర్లో "మదర్స్ డే" సందర్బంగా జంజర్ల కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవంలో అయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి మొదటి స్నేహితురాలిని, మొదటి గురువని పేర్కొన్నారు. మాతృశక్తి లేనిదే సమాజం లేదని,. మహిళా శక్తి లేకుండా దేశ అభివృద్ధి జరగదని, తల్లుల అభివృద్ధే కుటుంబాల అభివృద్ధి, అదే దేశ అభి వృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కనిపెంచిన తల్లిదండ్రులు మరువవద్దని, వారిని కడదాకా కంటికిరెప్పలా కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, సిపిఐ నాయకులు కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శ్రీను, ఎస్ కె ఫహీమ్, పాటి మోహన్, మాతంగి లింగయ్య, మాటేటి గోపాల్, దేబ్బడ గురుమూర్తి, మర్రి గోపికృష్ణ, తూముల శ్రీనివాస్, బరిగెల భూపేష్, గుత్తుల శ్రీనివాస్, ఎస్.కె.ఖయూమ్, మండల రాజు,గుగులోత్ నగేష్, ఎండి.అంకూస్, సింగిరాల రమేష్, దాసు, జలీల్, రణధీర్, మర్రి కృష్ణ, మద్దెల విజయలక్ష్మి, దార లక్ష్మి, ఎర్రబెల్లి శంకర్, దాట్ల శ్రవణ్, కొరిమి సురేష్,కొయ్యడ వెంకన్న, సామర్ల సమ్మయ్య, అల్లకొండ సాయిలు, గోపి, మజ్జిగ రణధీర్, ఎస్.కె రసూల్, బానోత్ శ్రీనివాస్,అలీం, అనీఫ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ