తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 24 (తెలుగు వెలుగు)జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య కథనం ప్రకారం, పాపకొల్లు గ్రామంలో గల నిమ్మటూరి సత్యం ఇంటి ఆవరణలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని, లబ్ధిదారుల వద్ద నుండి గరిక రామారావు, కొట్టే నరసింహారావు, వాంకుడోత్ రఘులు కొనుగోలు చేసుకుని డంపు చేసుకుని ఉండగా ఈరోజు మధ్యాహ్నం 3:00 సమయంలో జూలూరుపాడు పోలీసు వారు మరియు కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి చేసి ,వారి వద్ద నుండి సుమారు 14 క్వింటాళ్ళ 40 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకొని, సదరు పైన పేర్కొన్న నలుగురు వ్యక్తులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయనైనది. ఇట్టి కేసులో దర్యాప్తు జరుగుతున్నది, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని జూలూరుపాడు పోలీస్ స్టేషన్ వారు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ