తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం పట్టణ ప్రాంతంలో ఇంటింటికి నీటిని అందించే క్రమంలో మిషన్ భగీరథ పైపులు వేయటం కోసమై రామవరం మార్కెట్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో పొక్లిన్తో సి సి రోడ్డును తవ్వి పైపులు వేసి అదే మట్టితో కుంటను కూర్చోడం వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల మట్టి మొత్తం లోనికి దిగబడి సీసీ రోడ్డు గొయ్యి లాగా ఏర్పడి చాలామంది బాటసారిలు పడిపోవడం జరిగింది. కార్పొరేషన్ వారు గానీ మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను మందలించడంతో యుద్ధ ప్రాతిపదికన గుంటలు కూర్చోటం జరిగిందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ విషయంపై మునిగడప వెంకటేశ్వర్లు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ఈ సమస్య తక్షణమే తీర్చకపోతే జరగబోయే పరిణామాలకు కాంట్రాక్టర్ బాధ్యుడు అవుతాడని అన్నారు. శాసనసభ్యుల అధికారులకు ఇచ్చిన ఆదేశానుసారం సంబంధిత కాంట్రాక్టర్ సదరు గొయ్యులను సిమెంట్ యాస్ తో పూడ్చడానికి వారి సిబ్బందిని పంపించడం జరిగింది అని ఆయన తెలిపారు .రోడ్డుపూడ్చే కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపికృష్ణ, కొత్తగూడెం టు టౌన్ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్, రామవరం సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు అజ్మీరా బాలాజీ నాయక్,లు గుంతలు పూడ్చే పనులను పర్యవేక్షించారు. భవిష్యత్తులో పైప్ లైన్ వేయడానికి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వస్తే గొయ్యి తీసిన వెంటనే కాంక్రీట్ తో పూడ్చాలని బాటసారులకు ఇబ్బంది కలగకూడదని అందుకు జాగ్రత్త పడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉన్నదని వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది
Admin
తెలుగు వెలుగు టీవీ