Monday, 20 April 2026 01:31:32 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

రామవరం మార్కెట్ సెంటర్ లో గుంతలను పూడిపిస్తున్నసిపిఐ నాయకులు

Date : 14 August 2025 04:38 PM Views : 577

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం పట్టణ ప్రాంతంలో ఇంటింటికి నీటిని అందించే క్రమంలో మిషన్ భగీరథ పైపులు వేయటం కోసమై రామవరం మార్కెట్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో పొక్లిన్తో సి సి రోడ్డును తవ్వి పైపులు వేసి అదే మట్టితో కుంటను కూర్చోడం వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల మట్టి మొత్తం లోనికి దిగబడి సీసీ రోడ్డు గొయ్యి లాగా ఏర్పడి చాలామంది బాటసారిలు పడిపోవడం జరిగింది. కార్పొరేషన్ వారు గానీ మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను మందలించడంతో యుద్ధ ప్రాతిపదికన గుంటలు కూర్చోటం జరిగిందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ విషయంపై మునిగడప వెంకటేశ్వర్లు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ఈ సమస్య తక్షణమే తీర్చకపోతే జరగబోయే పరిణామాలకు కాంట్రాక్టర్ బాధ్యుడు అవుతాడని అన్నారు. శాసనసభ్యుల అధికారులకు ఇచ్చిన ఆదేశానుసారం సంబంధిత కాంట్రాక్టర్ సదరు గొయ్యులను సిమెంట్ యాస్ తో పూడ్చడానికి వారి సిబ్బందిని పంపించడం జరిగింది అని ఆయన తెలిపారు .రోడ్డుపూడ్చే కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపికృష్ణ, కొత్తగూడెం టు టౌన్ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్, రామవరం సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు అజ్మీరా బాలాజీ నాయక్,లు గుంతలు పూడ్చే పనులను పర్యవేక్షించారు. భవిష్యత్తులో పైప్ లైన్ వేయడానికి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వస్తే గొయ్యి తీసిన వెంటనే కాంక్రీట్ తో పూడ్చాలని బాటసారులకు ఇబ్బంది కలగకూడదని అందుకు జాగ్రత్త పడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉన్నదని వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :