తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : హైదరాబాద్ లో సింగరేణి భవన్ లో గురువారం ఉదయం సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం నీ కలిసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ . కార్మిక సమస్యల పై చర్చలు జరిపారు,దానిలో ప్రథమంగా సి&ఎండి,డైరెక్టర్ల స్ట్రక్చర్ సమావేశం లో ఒప్పుకున్న పలు కార్మికుల సమస్యల పై పదిహేను రోజుల్లో సర్కులర్ యాజమాన్యం విడుదల చేస్తుంది అని తెలిపారు,దానిలో ప్రథమంగా మైనింగ్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగులు మెడికల్ అన్ఫిట్ అయినా వారికి సర్ఫేస్ లో సుటబుల్ జాబ్ ఇవ్వడానికి ఈపి ఆపరేటర్లకు. D టు C, C టు B గ్రేడ్ వారికి వెకెన్సీస్ తో సంబంధం లేకుండా ప్రమోషన్ లు ఇవ్వడానికి, మారుపేర్లు విషయం పై అడ్వకేట్ జనరల్ దగ్గర ఉన్నందున యాజమాన్యం మారు పేర్ల సమస్యని వెంటనే పరిష్కారం అయ్యేవిధంగా ప్రభుత్వం తో పాటు అడ్వకేట్ జనరల్ ను సంప్రదించి సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేవిధంగా చూడాలి అని కోరారు,అదేవిధంగా మొన్న జరిగిన మెడికల్ బోర్డు లో 55 మంది బోర్డు కి హాజరు అవ్వగా ఐదుగురు నీ మాత్రమే అన్ఫిట్ చేశారు అని వారికి మళ్ళీ మెడికల్ బోర్డు పెట్టాలి అని వినతి పత్రం అందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ