తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ప్రాజెక్టు, లక్ష్మీదేవిపల్లి సెక్టార్, ఇంద్రానగర్ అంగన్వాడి కేంద్రం నందు "అమ్మమాట అంగనవాడి బాట" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని జె.స్వర్ణలత లేనినా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నమోదు అయ్యే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ యొక్క "అమ్మ మాట అంగనవాడి బాట" కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి లబ్ధిదారుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కృషి చేయాలని తెలిపారు. మొదటి 1000 రోజుల తల్లి బిడ్డల సంరక్షణ ధ్యేయంగా ప్రతి అంగనవాడి కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య, ఆటపాటలతో కూడిన విద్యను అందించడం, అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకం ద్వారా వచ్చే రాబడిని నమోదైన లబ్ధిదారులకు అందజేయాలని, జిల్లాలో ఏ ఒక్క అంగన్వాడి కేంద్రాలలో తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడే వారి సంఖ్య తగ్గించే వరకు అంగనవాడి టీచర్లు అహర్నిశలు కష్టపడాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా పిల్లల ఎత్తు బరువులు చూచి వారి ఆరోగ్య సంరక్షణ కోసమై వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ అమ్మ మాట అంగనవాడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ అధికారిని మరియు స్థానిక సర్పంచ్ ద్వారా లక్ష్మీదేవిపల్లి సెక్టర్ లో అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం తో పాటు, నాణ్యతతో కూడిన యూనిఫామ్లు, విద్యారంభం సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రాజెక్టు సిడిపిఓ లక్ష్మీప్రసన్న, శ్రీనగర్ పంచాయతీ సర్పంచ్ రాణి, లక్ష్మీదేవిపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త సంపత్, మహిళా సాధికారిత జిల్లా కోఆర్డినేటర్ రూప సంతోషి, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ