Sunday, 19 April 2026 03:31:02 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 09 February 2026 07:55 PM Views : 91

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార భద్రత తనిఖీ అధికారులను ఆదేశించారు.ఆహార వ్యాపారం నిర్వహించే ప్రతి దుకాణదారుడికి అవసరమైన లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, సంబంధిత శిక్షణ కేంద్రాల ద్వారా వారికి ఆహార భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెల ఆసుపత్రుల్లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులను గుర్తించి, వాటికి గల స్థానిక కారణాలను విశ్లేషించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఎక్కువగా ఎలాంటి ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని తెలిపారు.మొదటి దశలో జిల్లాలోని 5 అంగన్వాడీ కేంద్రాలు, 5 పాఠశాలలు, 5 ప్రభుత్వ/ప్రైవేట్ వసతి గృహాలను సందర్శించి, ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారిపై ఎలాంటి ఉపశమనం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులు, వినియోగదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, సేంద్రియ ఉత్పత్తులు, మిల్లెట్స్ ఆధారిత ఆహారాల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆహార పదార్థాల్లో రసాయనాల సాంద్రతను గుర్తించేందుకు చేపట్టాల్సిన పరీక్షల విధానాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.రాబోయే శ్రీరామనవమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసే స్టాల్స్, హోటళ్ల యజమానులకు ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేట్ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విస్తృతంగా నాణ్యత తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మధువరం ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :