Friday, 19 June 2026 05:39:42 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 09 February 2026 07:55 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార భద్రత తనిఖీ అధికారులను ఆదేశించారు.ఆహార వ్యాపారం నిర్వహించే ప్రతి దుకాణదారుడికి అవసరమైన లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, సంబంధిత శిక్షణ కేంద్రాల ద్వారా వారికి ఆహార భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెల ఆసుపత్రుల్లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులను గుర్తించి, వాటికి గల స్థానిక కారణాలను విశ్లేషించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఎక్కువగా ఎలాంటి ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని తెలిపారు.మొదటి దశలో జిల్లాలోని 5 అంగన్వాడీ కేంద్రాలు, 5 పాఠశాలలు, 5 ప్రభుత్వ/ప్రైవేట్ వసతి గృహాలను సందర్శించి, ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారిపై ఎలాంటి ఉపశమనం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులు, వినియోగదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, సేంద్రియ ఉత్పత్తులు, మిల్లెట్స్ ఆధారిత ఆహారాల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆహార పదార్థాల్లో రసాయనాల సాంద్రతను గుర్తించేందుకు చేపట్టాల్సిన పరీక్షల విధానాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.రాబోయే శ్రీరామనవమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసే స్టాల్స్, హోటళ్ల యజమానులకు ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేట్ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విస్తృతంగా నాణ్యత తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మధువరం ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :