Friday, 19 June 2026 02:52:27 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగు చర్యలు చేపట్టాలి. రైతులకు వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచనలు.

Date : 14 June 2026 05:35 PM Views : 49

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జూన్ 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో రానున్న రోజుల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.వర్షాధార పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నందున రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం వంటి పంటల సాగుకు సిద్ధం కావాలని సూచించారు. విత్తనాల ఎంపికలో ధృవీకరించబడిన, నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.పొలాల్లో అధిక తేమ లేకుండా నీరు నిల్వ కాకుండా కాలువలు ఏర్పాటు చేయాలని, నేలలో తగిన తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని సూచించారు. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే తక్కువ, ములుగు జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.చెరువులు, కుంటలు మరియు ఇతర నీటి వనరులను శుభ్రపరచి వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడరాదని, పశువులను కూడా అక్కడ ఉంచరాదని రైతులకు హెచ్చరించారు.వేరుశనగ, సోయాబీన్, జొన్న, పెసర, కంది, మినుము వంటి పంటల విత్తనాలను విత్తే ముందు శాస్త్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వరి నారుమళ్ల కోసం నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని, తెలంగాణ సోనా (RNR-15048) వంటి అధిక దిగుబడి రకాలను వినియోగించాలని సూచించారు.వాతావరణ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని సాగు పనులు చేపట్టాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారి బాబురావు విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: