తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 6 తెలుగు వెలుగు )జూలూరుపాడు మండల సీపీఐ సీనియర్ నాయకులు వల్ల పిన్ని సత్యనారాయణ మరణం బాధాకరమని సిపిఐ పార్టీకి తీరని లోటని పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని వారి కుటుంబానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ,కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు సోమవారం కొత్తూరు గ్రామంలో జరిగిన దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు , సత్యనారాయణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశాడని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నిజాయితీ గల నాయకుడని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు , నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు ఎస్కె నాగుల మీరా, యలంకి మధు, సిరిపురపు వెంకటేశ్వర్లు, యాస రోశయ్య గుండె పిన్ని మధు గార్లపాటి వీరభద్రము, గుడిమెట్ల సీతయ్య కొండ వీరయ్య, పాలెపు ప్రభాకర్ నిమ్మటూరి లచ్చయ్య ,పత్తిపాటి మహేష్ రోశారావు రమణయ్య సొసైటీ మాజీ చైర్మన్ పొలదాసు కృష్ణమూర్తి కాంగ్రెస్ నాయకులు నున్న కృష్ణయ్య తదితరులు నివాళులర్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ