తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 25 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం పరిధిలోని పడమట నర్సాపురం గ్రామం నందు బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. మండలంలోని అన్ని పంచాయతీ లలో పార్టీ స్థానిక ఎన్నికలపై గ్రామస్థాయి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి హాజరై వారు ప్రసంగిస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారు అని తెలియజేస్తూ మోడీ సారధ్యంలో భారత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే కాకుండా రాష్ట్రంలో అమలయ్యే సన్నబియ్యం , ఇందిరమ్మ ఇళ్లు, cc రోడ్లు , వీధి దీపాలు,పల్లె ప్రకృతి వనాలు,ఉచిత గ్యాస్ కలెక్షన్లు , ముద్ర లోన్లు తదితర పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవే అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాలకిషన్, మండల ప్రధాన కార్యదర్శులు భూక్యా శ్రీను , నిమ్మటూరి రామారావు,యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు,సోషల్ మీడియా కన్వీనర్ చరణ్, కార్యదర్శి బాబులాల్,కోశాధికారి వీరన్న తదితర నాయకులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ