Sunday, 19 April 2026 03:29:12 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 22 May 2025 06:29 PM Views : 729

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా ఉన్న రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జల్ సంచెయ్ జన్ భాగీ దారి కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మించడానికి చేపట్టవలసిన చర్య గురించి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రహదారి వెంట ఇంకుడు గుంతలు ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భ జల మట్టం పెరుగుతుంది, తద్వారా నీటి కొరత సమస్య పరిష్కారం అవుతుందని అలాగే రహదారులపైన నీరు నిల్వకుండా రోడ్ల పాడైపోకుండా ఉంటాయి అని అన్నారు. ఇంకుడు గుంతలు రోడ్ల పక్కన, వర్షపు నీరు నిల్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గ్రామ, మండలం మరియు జిల్లాస్థాయిలో మార్కింగ్లు పెద్ద ఎత్తున చేయాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. మార్కింగ్ చేసిన ప్రదేశాలలో జెసిబి ద్వారా పంచాయతీరాజ్ శాఖ ఏఈ ల పర్యవేక్షణలో ఇంకుడు గుంతలను త్రవ్వాలన్నారు. అనంతరం స్థానికంగా దొరికే చిన్న రాళ్లను గుంతలో నింపాలన్నారు. రానున్న వర్షాకాలంలో చుక్క వర్షపు నీరు కూడా వృధా కాకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం సరైన పద్ధతిలో చేపట్టాలని వర్షపు నీరు గుంతలోకి చేరే విధంగా మాత్రమే నిర్మాణం ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంత నిర్మాణం అనంతరం త్రవ్విన మట్టిని అలా వదిలేయడం ద్వారా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టి ఎటువంటి ఉపయోగం ఉండదని, కాబట్టి ఇంకుడు గుంత నిర్మించిన వెంటనే మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. నిర్మించిన ప్రతి ఇంకుడు గుంత ఫోటోలను జెల్ సంజయ్ జెన్ భాగి దారి పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. దేశంలోనే జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో జిల్లా రెండవ స్థానంలో ఉందని ఇంకా పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :