తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చర్ల : ఇంటి స్థలం ప్రక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ వెళ్లిన ఘటన శుక్రవారం చర్ల మండలంలో చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ స్థలంలో నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ తీసుకెళ్లడంతో కుంజం సన్ను(18) అక్కడికక్కడే మృతి చెందాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా గుర్తించారు. గాయాల పాలైన వ్యక్తిని భద్రాచలం ఏరియా ఆసుపత్రి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ